పెన్పహాడ్, డిసెంబర్ 7 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తున్నదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని మాచారంలో ఇటీవల నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆయన విచ్చేసి దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లక సైదమ్మాబొబ్బయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, బీఆర్ఎస్ మండలాద్యక్షుడు దొంగరి యుగంధర్, జిల్లా నాయకులు మామిడి అంజయ్య, అనిరెడ్డి వెంకటరెడ్డి, బొల్లక బొబ్బయ్య, బిట్టు నాగేశ్వర్రావు, జూలకంటి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.