నల్లగొండ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణ(నీలగిరి) అభివృద్ధిపై క్షేత్ర స్థాయిలో అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కొత్త కమిషనర్గా రమణచారి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్తో కలిసి పట్టణంలో పర్యటించారు.
పానగల్ చెరువు కట్టతో పాటు అభివృద్ధి చేయాల్సిన ప్రధాన కూడళ్లను, రహదారులను పరిశీలించారు. అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు.