– ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలు
– హాజరు కానున్న 5,730 మంది విద్యార్థులు
రామగిరి, ఫిబ్రవరి 03 : మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ పలు సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈ నెల 4 నుండి ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,730 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా జి.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సెమిస్టర్ -1, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సెమిస్టర్ -3 పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న నిర్వహించే పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ సీఈఓ డా. జి.ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఆ రోజు నిర్వహించాల్సిన బీపీఈడీ, డీపీఈడీ పరీక్షలను ఈ నెల 13న అలాగే బీఈడీ పరీక్షలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు తెలిపోరు. మారిన షెడ్యూల్ను ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు గమనించి పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
భువనగిరిలో- 2. సూర్యాపేట, కోదాడలో- 2. మిర్యాలగూడ, నల్లగొండలో- 2 కొండమల్లేపల్లిలో- 2, మాల్, చౌటుప్పల్లో-1 పరీక్ష కేంద్రం మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 వేల మంది. మూడవ సెమిస్టర్ పరీక్షలకు 2,793 మంది హాజరవుతున్నారు. అలాగే బీపీఈడీ, డీపీఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలకు 400 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.