దౌల్తాబాద్ : ముత్యాలమ్మ ( Muthyalamma ) అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy) అన్నారు. దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ ప్రతిష్ఠా మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురా రోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుభిక్షంగా జీవించాలని కోరుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ వనజ స్వామి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, నాయకులు జనార్దన్ రెడ్డి, చింటూ, భాను, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.