మఠంపల్లి, మే 17 : పవిత్ర కృష్ణానది తీరాన, పంచనారసింహ క్షేత్రంగావెలుగొందుతున్న మట్టపల్లిలో లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సహస్ర కంకుమార్చన, శ్రీసూక్త సహిత మహాలక్ష్మీయాగం, కృష్ణానదిలో హంసవాహన సేవ నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం, ప్రబోధి తదితర కార్యక్రమాలను ఆగమ ప్రవర, ఖమ్మం జిల్లా ముత్తారం గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ బొర్రా వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సాయంత్రం 6గంటలకు కృష్ణానదిలో విద్యుద్దీపాలంకరణతో దేదీప్యమానంగా అలంకరించిన హంస వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ సిరికొండ నవీన్, ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్కుమార్, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, బ్రహ్మాచార్యులు, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, బదిరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, కొండవీటి శ్రీనాథ శర్మ, మహాదేవశర్మ, వరప్రసాద్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.