రామగిరి, డిసెంబర్ 22: సకల శాస్ర్తాలకు గణితం మూలమని మానవుని మనగడ గణితశాస్త్రంతో ముడిపడి ఉందని ఎంజీయూ వీసీ సీహెచ్.గోపాల్రెడ్డి అన్నారు. గణిత మేథావి శ్రీనివాసారామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం ఎంజీయూ సైన్స్ అండ్ ఇన్ఫ్రేటిక్స్ కళాశాలలోని గణితశాస్త్ర విభాగంలో ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ గణితం, భౌతిక, వాణిజ్య శాస్త్రల విశిష్ట వివరించి స్ఫూర్తినింపారు. గణితశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ పి.మద్దిలేటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ అన్నపూర్ణబుట్టి, బోర్డు ఆఫ్ సడీస్ చైర్మన్ డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ హైమవతి, శ్రీనివాస్, కిరణ్కుమార్ పాల్గొన్నారు.
అలాగే ఎన్జీ కళాశాలలో నిర్వహించిన గణిత దినోత్సవంలో ప్రిన్సిపాల్ ఉపేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
గణిత దినోత్సవం
చిట్యాలలో: శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నేరడ జడ్పీహెచ్ఎస్లో గణితానికి సంబంధించిన ముగ్గులు వేశారు. చిట్యాలలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. నేరడలో హెచ్ఎం రామ్మోహన్, గణిత ఉపాధ్యాయుడు దాసరి శ్రీరాములు, ఉపాధ్యాయులు శీనయ్య, మల్లికార్జున్ పాల్గొన్నారు. కృష్ణవేణి పాఠశాలలో ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుజ్జల ఉపేందర్రెడ్డి, కరస్పాండెంట్ కృష్ణ, ప్రిన్సిపాల్ యాదగిరి పాల్గొన్నారు.
మునుగోడు : మండల వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులకు గణిత అంశాలపై వ్యాసరచన, డ్రాయింగ్, పజిల్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
మిర్యాలగూడ: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని బీఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్దార్ధ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సంతోష్నగర్లో గల శివాని హైస్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులను తిలకించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీరకోటిరెడ్డి, దామరచర్ల జడ్పీటీసీ లలితహాతీరాంనాయక్, పెద్ద కోటిరెడ్డి, ఎంఈఓ బాలాజీనాయక్, పాల్గొన్నారు.
చందంపేట : మండలంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ సుజాత, ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో రామానుజన్ చిత్రపటానికి హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గణిత ఉపాధ్యాయులు శ్రీపతిరావు, ఎబినైజర్, లక్ష్మయ్య, పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్: యాద్గార్పల్లి హైస్కూలో గణిత దినోత్సవం ఘనంగా నిర్వ హించారు. హెచ్ఎం బాలు నాయక్ ఆధ్వర్యంలో గణిత టీచర్లను సన్మానించారు.
వేములపల్లి: రావుల పెంట జడ్పీ ఉన్న త పాఠశాలలో హెచ్ఎం లక్ష్మణ్నాయక్ రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. టీచర్లు కోటయ్య, మాలి జగన్మోహన్, వెంకయ్య పాల్గొన్నారు.