నడిగూడెం, జనవరి 8 : మండలంలోని చాకిరాల గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి బ్లెడుతో గాయపరుచుకున్నాడు. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన యాతాకుల వాలి అదే గ్రామానికి చెందిన వరికుప్పల కళింగరావు అనే వ్యక్తిని కొట్టి గాయపరిచాడు. దాంతో కళింగరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వాలి కోసం చాకిరాలకు వెళ్లారు. తనను పట్టుకుంటే చంపుతానని బెదిరిస్తూ వాలి తన జేబులో ఉన్న బ్లేడుతో గొంతు కోసుకునేందుకు యత్నించాడు.
పోలీసులు అతడిని ఆపే ప్రయత్నంలో ఛాతిపై కోసుకున్నాడు. పోలీసులు, స్థానికులు అతడిని హుటాహుటిన నడిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించి చికిత్స అందించారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. వాలిపై గతంలో పలు కేసులు ఉన్నాయని, రౌడీ షీట్ నమోదైనటు పేర్కొన్నారు.