నకిరేకల్, ఫిబ్రవరి 6 : జిల్లాలో నకిరేకల్ మున్సిపాలిటీని రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, గుర్రం గణేశ్, మాద నగేశ్ గౌడ్, దళిత బంధు కోఆర్డినేటర్ దైద పరమేశం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత
నార్కట్పల్లి : మాండ్ర గ్రామానికి చెందిన యాదమ్మకు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. సంబంధిత పత్రాన్ని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయంలో బాధితురాలి భర్త శంకరయ్యకు అందజేశారు. కార్యక్రమంలో సైదులు, స్వామి పాల్గొన్నారు.
నేడు చెక్కుల పంపిణీ
చిట్యాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టణంలోని ఎంఎన్ ఫంక్షన్హాల్లో మంగళవారం పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.