రామగిరి, మే 19 : నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 4,6 విద్యార్థులకు జూన్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఓఈ డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 30నుంచి నిర్వహించాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొ న్నారు. అలాగే జూన్ 3 నుంచి డిగ్రీ సెమిస్టర్ 1, 2, 3, 5 బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. టైంటేబుల్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.