నకిరేకల్, జనవరి 9 : చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు ఔట్డోర్ స్టేడియంలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ బడుగుల లింగయ్య, జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి, చిరుమర్తి చేయూత ఫౌండేషన్ చైర్మన్ చిరుమర్తి మనోజ్కుమార్ జ్యోతి ప్రజల్వన చేసి జాతీయ జెండా, క్రీడా పోటీలకు సంబంధించిన జెండాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనం స్వీకరించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున క్రీడాపోటీలు నిర్వహిస్తున్న చిరుమర్తి చేయూత ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పీఈటీల సాయంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు.
ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కృషి చేస్తున్నదన్నారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదన్నారు. క్రీడాపోటీల నిర్వహణ ప్రభుత్వ పాఠశాలలే వేదికలు అవుతున్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులను సమీకరించి వేదిక ఏర్పాటు చేసినందుకు విద్యార్థులు, తన తరపున చిరుమర్తి చేయూత ఫౌండేషన్కు ధన్యావాదాలు తెలిపారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రభుత్వ సహకారంతో క్రీడలను మరింత ప్రోత్సహిస్తానని తెలిపారు. పోటీల్లో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 89టీమ్లు పాల్గొంటుండగా 11వరకు పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. తొలిరోజు 16టీమ్లు పోటీలు పడినట్లు తెలిపారు. అంతకుముందు పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి క్రీడాకారులతో కలిసి ఔట్ డోర్ స్టేడియం వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సెల్ఫీలు దిగారు.
స్టేజీపై పలువురు విద్యార్థులు అద్భుతంగా పాటలు పాడారు. కార్యక్రమంలో నకిరేకల్, చిట్యాల మున్సిపల్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్గౌడ్, కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, కూరెళ్ల లింగస్వామి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, తరాల బలరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, నకిరేకల్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, పీఈటీలు చింతకాయల పుల్లయ్య, నాయిని మధు, అన్ని మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంఈఓలు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.