ఐటీ హబ్లో కొలువుల భర్తీకి ఈ నెల 26న తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నాం. సదా శివరెడ్డి ఫంక్షన్హాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జాబ్మేళా ఉంటుంది. మొదట 9 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి. స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే మూడేండ్లలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తాం. పాత కలెక్టరేట్ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతాం.
– ఐటీ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట సిగలో మరో మణిహారం చేరబోతున్నది. స్థానిక విద్యార్థులు, యువత కల నెరవేర్చేలా ఐట్ హబ్ రాబోతున్నది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో నగరాలకే పరిమితమైన ఐటీ కేంద్రాలు జిల్లా కేంద్రాలకూ వస్తున్నాయి. ఇప్పటికే నల్లగొండ పట్టణంలో ఐటీ హబ్ నిర్మాణం పూర్తవగా సూర్యాపేటలోని పాత కలెక్టరేట్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి చర్చించడంతో ప్రస్తుతం 9 కంపెనీలు ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం వేల కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాల, కొత్త కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, మినీ ట్యాంక్బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహాప్రస్థానం, విశాలమైన రోడ్లు, పార్కులు నిర్మాణం కాగా ఎటుచూసినా ఆధునిక హంగులతో కొత్త కల సంతరించుకున్నది. ఇవన్నీ ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అక్టోబర్ 2న ఐటీహబ్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
సూర్యాపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనే లక్ష్యంగా ఐటీ హబ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు తెచ్చి సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుండగా తాజాగా సూర్యాపేటలోని పాత కలెక్టరేట్ భవనం ఐటీ హబ్గా అవతరించబోతోంది. హైదరాబాద్లోని ఐటీ హబ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని హంగులతో కార్పొరేట్ స్థాయిలో ఐటీ హబ్ను తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇవ్వడంతో అమెరికాలోని పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు సూర్యాపేటకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఐటీ హబ్ మరో మణిహారం కాబోతున్నది.
ఐటీ హబ్గా పాత కలెక్టరేట్ భవనం..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనం త్వరలోనే ఐటీ హబ్గా మారబోతోంది. గత మూడేళ్ల క్రితం ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించగా 2021 చివరలో అమెరికాలోని ఒకటి రెండు ఐటీ కంపెనీలతో చర్చించి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో మాట్లాడారు. అనంతరం కేటీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో మంత్రి జగదీశ్రెడ్డితో మాట్లాడిన కంపెనీల ప్రతినిధులు కేటీఆర్ను కలిసి సూర్యాపేటలో ఐటీ కంపెనీల ఏర్పాటుపై మాట్లాడారు. అలాగే ఇటీవల అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీల ప్రతినిధులు రాజు సంగాని, ఫణి పాలేటి, శశి దేవిరెడ్డి, సందీప్రెడ్డి కట్ట, అభిషేక్ బోయినపల్లి, ప్రియారాజ్ విజయ్ దండాల, రాష్ట్ర ఐటీ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ విజయ్ రంగినేని, టాస్క్ కో-ఆర్డినేటర్ ప్రదీప్తో జూమ్ మీటింగ్లో మంత్రి మాట్లాడి సూర్యాపేట అభివృద్ధిపై వివరించారు.
కార్పొరేట్ స్థాయిలో..
సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్ను అమెరికా, హైదరాబాద్లోని ఐటీ కంపెనీలకు ధీటుగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని మంత్రి అమెరికా ఐటీ కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. బ్రహ్మాండమైన సదుపాయాలు, వాతావరణం కల్పిస్తామన్నారు. దాంతో ఆయా కంపెనీల ప్రతినిధులు అంగీకరించి సూర్యాపేటలో బ్రాంచ్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. ఐటీ హబ్ అక్టోబర్ 2న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
జిల్లా శంకర్కు మంత్రి, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు
సూర్యాపేట టౌన్ ,నీలగిరి, సెప్టెంబర్ 22 : రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ఎన్నికైన జిల్లా శంకర్కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుభా కాంక్షలు తెలిపారు. సూర్యాపేటలో తనను మర్యాద పూర్వకంగా కలసిన జిల్లా శంకర్ను మంత్రి అభినందించి సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని షెడ్యూల్ కులాల హక్కులను పరిర క్షించి వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా శంకర్ మాట్లాడుతూ.. తనకు ఎస్సీ కమిషన్ సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి జగదీశ్రెడ్డి
గత ఎన్నికల సందర్భంగా సూర్యాపేటకు ఐటీ హబ్ తీసుకొస్తానని వాగ్దానం చేసిన మంత్రి జగదీశ్రెడ్డి చెప్పినట్లుగానే సూర్యాపేటకు ఐటీ హబ్ను తీసుకువచ్చారు. అక్టోబర్ 2న సూర్యాపేటలో ఐటీ హాబ్ను ప్రారంభించనున్నారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వారధిగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో వచ్చే నెల 2న మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ఐటీ హబ్ ప్రారంభం కానున్నది. పాత కలెక్టరేట్ భవనంలో ప్రారంభం కానున్న ఐటీ హాబ్లో ఏర్పాటు కానున్న కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ మేళా పోస్టర్ను శుక్రవారం అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూర్యాపేటలో ప్రారంభం కానున్న ఐటీ హాబ్లో 9 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళాను ఈ నెల 26న నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు చెప్పారు. సూర్యాపేటలోని సదాశివరెడ్డి ఫంక్షన్హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జాబ్ మేళాను బీటెక్ చదివిన యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. రెండు రోజుల వ్యవధిలోనే కార్యకలాపాలను నిర్వహించేందుకు 9 కంపెనీలు ముందుకు వచ్చాయని, భవిష్యత్లో మరిన్ని కంపెనీలు ముందుకు రానున్నట్లు వెల్లడించారు. రాబోయే మూడేళ్ల కాలంలో ఐటీలో హైదరాబాద్ తర్వాత సూర్యాపేటను తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతకుముందు అధికారులతో కలిసి ఐటీ హబ్గా మారనున్న పాత కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పరిశీలించారు. వారం రోజుల్లో కార్పొరేట్ తరహాలో భవనాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, టాస్క్ డైరెక్టర్ శ్రీకాంత్ సిన్వా, ఐటీ డైరెక్టర్ రంగినేని విజయ్, అధికారులు పాల్గొన్నారు.