హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/అయిజ, మే 23: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో వర్షాకాలం రాకముందే తుంగభద్రకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటక రాష్ర్టాన్ని నైరుతి రుతుపవనాలు అప్పుడే తాకినట్టు అధికారుల తెలిపారు. గత రెండు రోజులుగా తుంగభద్ర బేసిన్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్మగళూర్, వరనాడులో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రలో వరద ఉప్పొంగుతున్నది. కేవలం రోజు వ్యవధిలోనే డ్యామ్లోకి 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పెరిగిపోయింది.
తుంగభద్ర డ్యామ్కు వర్షాకాలం ఆరంభంలోనే ఇంత పెద్ద మొత్తంలో వరద రావడం దశాబ్దాల తరువాత ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 100.855 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 31.184 టీఎంసీలు నిల్వ ఉండగా.. 1633 అడుగులకుగానూ ప్రస్తుతం 1607.78 అడుగులకు చేరినట్టు వెల్లడించారు. ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. సుంకేసుల, శ్రీశైలం రిజర్వాయర్కు సైతం వరద వచ్చిచేరుతున్నది.