నల్లగొండ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నల్గొండ జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని స్థానిక వీటి కాలనీ హనుమాన్ దేవాలయంలో కవిత పేరు మీద పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంచర్ల రమాదేవి విచ్చేసి కేక్ కటింగ్ చేశారు.
స్వీట్స్ పంచిపెట్టారు. కార్యక్రమంలో జాగృతి మహిళా కన్వీనర్ ఆడెపు వరలక్ష్మి, కోయగూర పద్మ, నాశబోయిన సునంద, టీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు సింగెం లక్ష్మి, జాగృతి జిల్లా కో కన్వీనర్ కొండేటి నివాస్, తుమ్మనగోటి వెంకట్ , ఒప్పల మారుతి ప్రకాష్, కటకం వెంకటాచారి , కట్లకుంట్ల నాగార్జున, కట్ట రామకృష్ణ, నాగేల్లి మధు, టీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.