మిర్యాలగూడ, ఫిబ్రవరి 3 : ఈ నెల 5న పట్టణంలోని నందిపహాడ్ టీఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే నియోజకర్గంలోని సర్పంచ్లకు ఆత్మీయ సన్మానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.