బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 6 : మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పదేండ్లలో సూర్యాపేట పట్టణాన్ని మహా నగరాలకు దీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, మహాప్రస్థానం, మినీ ట్యాంక్బండ్, ఎస్టీ ప్లాంట్ అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూరి నరేందర్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంగళవారం షాద్నగర్ మున్సిపల్ చైర్మన్తోపాటు పాలకవర్గం సూర్యాపేటకు వచ్చింది. ఈ సందర్భంగా జమునానగర్లో చెత్త నుంచి ప్లాస్టిక్ తయారు చేయడం, చెత్త నుంచి బ్రిక్స్ తయారు చేయడం, తడి పొడి చెత్తలను ఎరువుగా మార్చడాన్ని పరిశీలించారు. అనంతరం బాలెంల డంపింగ్ యార్డుతోపాటు మహాప్రస్థానాన్ని, మినీ ట్యాంక్బండ్ను సందర్శించి బోటింగ్ చేశారు.
ఈ సందర్భంగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ పి.రామానుజులరెడ్డి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారికి వివరించారు. అనంతరం షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూరి నరేందర్ మాట్లాడుతూ విశాలమైన ప్రదేశంలో చుట్టూ చెట్లు, గార్డెన్తో ఏర్పాటు చేసిన మహా ప్రస్థానం మహా నగరాలకు దీటుగా ఉందన్నారు. మహా ప్రస్ధానంలో ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు మినీ ట్యాంక్బండ్లో ఏర్పాటు చేసిన బోటింగ్ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఇక్కడ అమలవుతున్న ప్రతి కార్యక్రమం ఆచరణీయమని, వీటిని తమ మున్సిపాలిటీలో అమలు చేసేందుకు చర్యలు చేపడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ చామ వెంకన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, సతీశ్, ఆర్ఐ శివరాంరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఎస్ఎస్ఆర్ ప్రసాద్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ శివప్రసాద్, షాద్నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.