దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పంచాయతీరాజ్ బీటీ రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 13వ ఫైనాన్స్లో మంజూరై న రోడ్లకు రెన్యువల్ చేయనందున మళ్లీ తిరిగి అట్టి రోడ్లకు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
చింతపల్లి మండలంలోని కుర్మేడ్, వింజమూరు, నెల్వలపల్లి, కొండమల్లేపల్లి మండలంలోని చింతకుంట్ల, పీఏపల్లి మండ లంలోని కేశనేనిపల్లి గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అట్టి రోడ్లకు రెన్యువల్ చేసి నిధులు మంజూరు చేసేవిధంగా కృషి చేయాలని కోరారు. డిండి లిఫ్టు స్కీంలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీ వాహనాలు వెళ్లడం వల్ల రోడ్లు గుంతలుగా మారాయని అట్టి రోడ్లకు మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే ఆసెంబ్లీలో కోరారు.