దేవరకొండ, నవంబర్ 9: దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆర్డీఓ శ్రీరాములుకు నామిషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి చూసి గులాబీ జెండాను మరోసారి దేవరకొండ ఖిల్లాపై భారీ మెజార్టీతో ఎగురవేయాలని ఆయన కోరారు.
సీఎం కేసీఆర్ మూడో సారి సీఎం కావాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమని అన్నారు. గతంలో కంటే అధిక మెజార్టీ ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాతవత్ జగన్లాల్నాయక్, హన్మంత్ వెంకటేశ్గౌడ్, గాజుల ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, నీల రవికుమార్, తూం బుచ్చిరెడ్డి తదితరులున్నారు.
దేవరకొండ, నవంబర్ 9: నియోజకర్గంలో డిండి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 500 కుటుంబాలు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. డిండి మండల కేంద్రానికి చెందిన 250 కుటుంబాలు, సిగరాజ్పల్లికి చెందిన 125 కుటుంబాలు, బొగ్గులదొనకి చెందిన 125 కుటుంబాలు బీఆర్ఎస్లోకి చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పూర్తికావాలంటే కేసీఆర్ను మూడో సారి సీఎంను చేయాలని ఆయన కోరారు.
ఇప్పటికే సింగరాజ్ పల్లి, గొట్టిముక్కల ప్రాజెక్టులు 95 శాతం పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే రైతులకు రైతుబంధు లభిస్తుందని పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల పధకం రూ.6340 కోట్ల నిధులు కేటాయించగా ఇప్పటికే రూ.2800 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. నక్కలగండి ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యానాయక్, వడిత రమేష్, నేనావత్ కిషన్నాయక్, రమావత్ జగన్లాల్నాయక్, ఎంపీపీ మాధవరం సునీతాజనార్దన్రావు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాజీనేని వెంకటేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ తూం నాగార్జున్రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పేర్వాల జంగారెడ్డి, భగవ్తరావు, రాఘవాచారి, గెలమోని శ్రీను తదితరులున్నారు.
మాల్: రావమ్మ మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చింతపల్లి మండల పరిధిలోని బట్టుగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దూపాటి రాజు తల్లి రావమ్మ గురువారం మృతి చెందడంతో అమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ దండేటికర్ లలితా మోహన్, బీఆర్ఎస్ నాయకులు దండేటికర్ విజయ్ ప్రసాద్, ఆరెకంటి జంగయ్య, రేణికుంట్ల వెంకటయ్య, ఆరెకంటి రాధాకృష్ణ, బిచ్చనాయక్, వీరయ్య, రాములు, శంకర య్య, జంగయ్య, చంద్రయ్య, శ్రీను, విజయ్ ఉన్నారు.