నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మిర్యాలగూడ నియోజకవర్గ యువనేత నల్లమోతు సిద్ధార్థ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరందరికి సిద్ధార్థ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని సిద్ధార్థ అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉబ్బపల్లి వెంకమ్మ, ఇలియాస్, ఉదయభాస్కర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాయకులూ ఉబ్బపల్లి మధు, దైదా సోమసుందర్, పత్తిపాటి నవాబ్, సాదినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.