నీలగిరి. జూన్ 10 : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నింటినీ వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ దాసరి హరిచందన ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో సోమవారం ఆమె అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు, విద్యార్థులకు దుస్తుల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
తాగునీరు, టాయిలెట్లు, ఎలక్ట్రికల్ వంటి మరమ్మతు పనులను పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచం ద్ర, మిషన్ భగీరథ ఎస్ఈ డి. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.