నీలగిరి, జూలై 16: జిల్లాలో సర్ ప్రక్రియను ఆగస్టు 3లో గా వందశాతం పూర్తి చేయాలని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం మ్యాపింగ్, డిజిటలైజేషన్ పూర్తయిందని, రానున్న నాలుగు నుంచి 5 రోజుల్లో దీనిని 92 శాతానికి పెంచాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం సర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో వంద శాతం మ్యాపింగ్, డిజిటలైజేషన్ పూర్తి చేసేలా పార్టీలు, బూత్ స్థాయి ప్రతినిధులకు సహకరించాలని కోరారు.
జిల్లాలో ఇప్పటివరకు 10 లక్షల మ్యాపింగ్లు పూర్తయ్యాయని, మరో 54 వేల మ్యాపింగ్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇంకా 344 ఓటర్లను గుర్తించాల్సి ఉందన్నారు. బుధవారం నాటికి పెండింగ్ మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయి తే డబుల్ ఓటింగ్కు అవకాశం తగ్గుతుందన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఇంటింటికి వెళ్లి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి క్వాలిటీ అధికారులను నియమించి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని, మరో 5 రోజుల్లో జిల్లాలో 92 శాతం మ్యాపింగ్ పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముంతాజ్ అలీ, బక పిచ్చయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, లింగస్వామి, అన్సారి, అన్నా రవి, రఫీ, రవిశంకర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.