కేతేపల్లి: సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు మెరుగైన వైద్యచికిత్స అందుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల పరిధిలోని తుంగతుర్తి, ఇప్పలగూడెం గ్రామాలకు చెందిన బి.ప్రకా శం, జె.శివశంకర్లు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.
వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రకాశంకు మంజూరైన రూ.2 లక్షలు, శివకు రూ. 1లక్ష ఎల్వోసీ పత్రాలను నకిరేకల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్యాలకు భరోసా ఇస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు కొప్పుల ప్రదీప్రెడ్డి, మట్టిపల్లి వినోద్కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.