మిర్యాలగూడ, ఆగస్టు 19 : చెన్నైలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్లో బీఎంఎస్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వరల్డ్ రికార్డు సాధించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకాడమీ మాస్టర్ మధు మాట్లాడుతూ..తమ విద్యార్థులు గద్దల యశస్విని, కృష్ణ సాయి అత్యుత్తమ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్, మెడల్ సాధించారని కొనియాడారు. విద్యార్థుల క్రమశిక్షణ, నిరంతర సాధన, కఠోర శ్రమ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
పిల్లల్లోని ప్రతిభను గుర్తించి నిరంతరం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు గద్దల అశోక్, రత్నకుమారి కృషి ప్రశంసనీయమన్నారు. అకాడమీలో అందిస్తున్న నాణ్యమైన శిక్షణ, ప్రోత్సాహం వల్లే క్రీడాకారులు రాణిస్తున్నారని తెలిపారు. గిన్నిస్ రికార్డు సాధించిన యశస్విని, కృష్ణ సాయి రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురసారాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు, విద్యార్థుల కుటుంబ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.