గుర్రంపోడు, ఆగస్టు 03 : గుర్రంపోడు మండలంలోని పాల్వాయి రైతు వేదికలో గురువారం ATMA–RPL ఆధారిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ఎస్ కంపసాగర్ శాస్త్రవేత్త బి.అనిల్ కుమార్ హాజరై మాట్లాడారు. రైతులకు నానో ఎరువుల వినియోగం, వాటి ప్రాముఖ్యత, పంటల వివిధ దశల్లో వినియోగించే విధానం అలాగే నానో ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రధానంగా అవగాహన కల్పించారు. నానో ఎరువులను శాస్త్రీయంగా, సిఫార్సు చేసిన మోతాదులో వినియోగించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని రైతులకు వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో పంటలకు ఆశించే చీడ పీడలు తెగుళ్లు వాటి యాజమాన్య పద్ధతులు గురించి రైతులకి వివరించారు. హాలియా ఏడీఏ సరిత మాట్లాడుతూ.. సన్నరకాలు పండించే రైతులు అందరూ విత్తనాలు తెచ్చిన డీలర్ దగ్గర ఈ నెల 10వ తేదీ లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో మాధవరెడ్డి, ఏఈఓలు పి.భగీరథ, మనోజ్, నేతాజీ, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.