నందికొండ, ఫిబ్రవరి 25 : గిరిజనులకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవమని, ఆయన ఆచరణలను పాటించాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంగ్ ఆధ్వర్యంలో నందికొండ హిల్కాలనీలో ఆదివారం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలకు ఆయనతోపాటు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వారు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి, బోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ గిరిజనుల ఉద్ధరణ కోసం సంత్ సేవాలాల్ చేసిన కృషి ఎనలేనిదని, ఆయన చూపిన బాటలో గిరిజనులు ఐక్యతతో నడువాలన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సీనియర్ నాయకులు శంకర్నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తావత్ రామచంద్రనాయక్, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు బాబూరావునాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగవాన్నాయక్, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, రవినాయక్, సైలాబ్నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్నాయక్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లిగారెడ్డి, జడ్పీటీసీ భారతిభాస్కర్నాయక్, ఎంపీపీ పాండమ్మశ్రీనివాస్రెడ్డి, డాక్టర్ కేశం అజ్మీర్, నాయకులు సక్రూనాయక్, చందులాల్నాయక్, మున్నినాయక్, కౌన్సిలర్లు మంగ్తానాయక్, మోహన్నాయక్, రమేశ్జీ పాల్గొన్నారు.