నకిరేకల్, జనవరి 17 : కళాసమితి నకిరేకల్ ఆధ్వర్యంలో అన్నమయ్య పదసమాకూర్చనం 28వ కార్యక్రమాన్ని సమితి అధ్యక్షురాలు జి. సుమలత ఆధ్వర్యంలో స్థానిక ఐశ్వర్యసాయి కల్యాణమండపంలో అన్నమయ్య సంకీర్తన పోటీలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో 22 మంది బాలబాలికలు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.
ప్రతిభ చూపిన బాలబాలికలకు సంగీత దర్శకుడు సాలూరి వాసురావు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం. పురుషో త్తమాచార్యులు, గాయకుడు రవి వర్మ, కవయిత్రి చక్రవర్తుల రోజాదేవి, కవయిత్రి కొండపల్లి నిహారిక బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారులు అలపించిన అన్నమయ్య సంకీర్తనలు పలువురిని అలరించాయి.