దేవరకొండ, అక్టోబర్ 30 : దేవరకొండలో మంగళవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలో సుమారు 80వేల మంది వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో మధ్యాహ్నం 3గంటలకు సభ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ వచ్చే సభకు బీఆర్స్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ప్రజా అశీర్వాద సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నాయకుడు గుత్తా అమిత్రెడ్డి పరిశీలించారు.