కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సీనియర్ సినీ నటి పావలా శ్యామలకు అగ్ర హీరో చిరంజీవి అండగా నిలిచారు. లక్షా పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన కష్టాల్ని తెలుసుకొని సాయం చేసిన చిరంజీవికి పావలా శ్యామల కృతజ్ఞతలు తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘గతంలో నా కూతురు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి రెండు లక్షలు ఇచ్చారు. మరోసారి నా దీనస్థితిని గమనించి పెద్ద మనసుతో లక్ష పదిహేనువందల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని తెలిపింది.