నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), జూన్ 03 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన నాల్గొవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో 14 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ డీబార్ అయినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి తెలిపారు. నేడు ఉదయం జరిగిన నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 2,004 మంది హాజరు కావాల్సి ఉండగా 1,791 మంది హాజరయ్యారు. 206 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఏడుగురు డీబార్ కాగా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగ్గురు, సూర్యాపేట ఆర్కే ఎల్కే డిగ్రీ కళాశాలలో ఒకరు, స్పందన డిగ్రీ కళాశాలలో ఒకరు, ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఒకరు, మోత్కూర్ లోని శ్రీ సంతోష్ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థి డీబార్ అయ్యారు.
అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ఐదవ సెమిస్టర్ పరీక్షలకు 1,833 మంది హాజరు కావాల్సి ఉండగా 1,555 మంది హాజరయ్యారు. 271 మంది గైర్హాజరు కాగా ఏడుగురు డీబార్ అయ్యారు. ఈ పరీక్షలో రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు, నల్లగొండలోని నీలగిరి డిగ్రీ కళాశాలలో ఒకరు, సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఒకరు, డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒకరు, భువనగిరి స్టాండ్ ఫర్ ఉమెన్ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, మిర్యాలగూడ విజేత డిగ్రీ కళాశాల ఒకరు డీబార్ అయ్యారు.