ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
10 కుటుంబాలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిక
దేవరకొండ, జూన్ 5 : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం బొగ్గులదొన గ్రామానికి చెందిన 10 కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధి చూసి టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
నియోజకవర్గంలో ప్రాజెక్టులు పూర్తయితే 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని రవీంద్రకుమార్ చెప్పారు. టీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్త రూ.100 చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, తండు చంద్రయ్య, మల్రెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, జయప్రకాశ్నారాయణ, బొడ్డుపల్లి కృష్ణ, వెంకటయ్య పాల్గొన్నారు.