యాదగిరిగుట్ట, మార్చి 21 : రాబోయే పాతికేండ్ల పాటు కార్మికులు మెచ్చే వేతన ఒప్పందాన్ని తీసుకువస్తామని బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి హామీనిచ్చారు. మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో శుక్రవారం ప్రీమియర్ ఎక్స్ఫ్లోజివ్ కంపెనీ లిమిటెడ్(పీఈఎల్) బీఆర్ఎస్కేవీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు దఫాలుగా గతంలో ఏ కార్మిక సంఘమూ సాధించలేని విధంగా గొప్ప వేతన ఒప్పందాన్ని తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్కేవీదేనన్నారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.60 లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాన్ని సాధించామని గుర్తుచేశారు.
2023లో చంద్రుడిపైన అడుగు పెట్టిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్లో ఉపయోగించిన జీఎస్ఎల్వీ మార్క్-3లో ఎస్-200 బూస్టర్ను అందించిన పీఈఎల్ కంపెనీ కార్మికుల పాత్రను అభినందించారు. ఇస్రో చేసిన ఎన్నో ప్రయోగాలకు సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ను అందించేందుకు కూడా కృషి చేశారని తెలిపారు. ఈ నెల 29న జరిగే కంపెనీ అధికారిక కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్తో కలిసి పోటీలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్కేవీలో 140 మంది, బీఎంఎస్లో 93 మంది కార్మికులు ఉన్నట్లు చెప్పారు.
కార్మికులు ఆలోచించి అండగా నిలిచే బీఆర్ఎస్కేవీ ‘బాణం’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం జనరల్ సెక్రటరీ బరిగెల నర్సింహులు, వర్సింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, ఉప కార్యదర్శి పాపయ్య, ఉపాధ్యక్షుడు గట్టికొప్పుల లక్ష్మీనర్సయ్య, కోశాధికారి గవ్వల రమేశ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, నాయకులు గుండ్లపల్లి వెంకటేశ్గౌడ్, సీస రమేశ్తోపాటు, బీఆర్ఎస్కేవీ నాయకులు పాల్గొన్నారు.