తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ మాసానికి సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. నిత్యం 25వేల మంది శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుకల్పించింది. మధ్యాహ్నం తిరుమల, తిరుపతిలోని టీటీడీ అద్దె గదులకు సంబంధించిన కోటాను సైతం విడుదల చేయనుంది. అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ భక్తులను కోరింది. ఇదిలా.. ఉండగా ఉగాది నుంచి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 14 నుంచి భక్తులను ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. అయితే భక్తులంతా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ను సమర్పించాలని స్పష్టం చేసింది.