న్యూఢిల్లీ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా హీరో ఆర్. మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నిర్ధేశకత్వంలో తెరకెక్కిన రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ వరల్డ్ ప్రీమియర్ కేన్స్లో గురువారం ప్రదర్శితమవుతుండగా మాధవన్ మాట్లాడుతూ భారత్ కొన్ని అసాధారణ కధలను ప్రపంచం ముందుంచాలని చెప్పారు.
ఆర్యభట్ట నుంచి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వరకూ ఎన్నో కధలను సిల్వర్స్క్రీన్పై భారత్ ఆవిష్కరించాల్సి ఉందని అన్నారు. సుందర్ పిచాయ్ వంటి వారు యువతరానికి స్ఫూర్తిదాయకమని, నటుల కంటే వారికి ఎక్కువ అభిమానులున్నారని చెప్పుకొచ్చారు. అలాంటి వారిపై సినిమాలు తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్కు అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. రాకెట్రీ స్క్రీనింగ్కు ముందు ఈ మూవీ పట్ల విపరీతమైన క్రేజ్ నెలకొంది. మాజీ శాస్త్రవేత్త, ఇస్రో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేసిన నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గూఢచర్యం కేసులో నంబి నారాయణన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. మాధవన్ ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించడంతో సినీ దర్శక నిర్మాతగా వ్యవహరించారు.