తెలుగులో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి దిశా పటానీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లిన దిశ అక్కడ కూడా మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం కల్కి, యోధ, కంగువా లాంటి మెగా ప్రాజెక్టుల్లో నటిస్తున్నది. చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ కావాలనుకున్న దిశ అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందట. ‘చిన్నప్పుడు పెద్దగా అల్లరి చేసేదాన్ని కాదు. చదువుల్లో టాప్లో ఉండేదాన్ని.
సైంటిస్ట్ కావాలనుకునేదాన్ని. పరిశోధనలవైపు వెళ్లాలనుకున్నా. కానీ, నా డెస్టినీ మరోలా ఉంది. లక్నో యూనివర్సిటీలో ఉండగా ఓ మాడలింగ్ కాంపిటిషన్ జరిగింది. ఆ పోటీ గురించి నాకు తెలియదు. పోటీదారుగా ఫ్రెండ్స్ నా పేరిచ్చారు. ఎందుకు ఇచ్చారని అడిగితే.. ‘విజేతను ముంబయికి పంపుతార’ని చెప్పారు. ముంబయి చూడాలన్న కోరికతో ఆ పోటీలో పాల్గొన్నా. లక్కీగా గెలిచా. అలా మాడలింగ్ వైపు నా అడుగులు పడ్డాయి. నలుగురిలోకి రావాలంటేనే మొహమాటపడేదాన్ని. అలాంటి నేను కెమెరా ముందుకు వచ్చినప్పుడు కాస్త తికమకపడ్డా. కానీ, ఎప్పుడైతే నటనను ప్రొఫెషన్గా భావించానో, అప్పటినుంచి ఏ ఇబ్బందీ అనిపించలేదు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. సినిమాల్లోకి రావాలని ఉండేదట కూడా! ఆమె కోరిక నా ద్వారా నెరవేరిందేమో!’ అని చెప్పుకొచ్చింది దిశ.