పట్నా : బాయ్ఫ్రెండ్తో సన్నిహితంగా ఉన్న తన ప్రైవేట్ వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో ప్రముఖ భోజ్పురి నటి త్రిషా కర్ మధు మండిపడ్డారు. ఈ వీడియో లీక్ అయిన తర్వాత సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేసిన వారిని మధు హెచ్చరించారు. ఈ వీడియోను ఎవరు తీశారు..సోషల్ మీడియా వేదికలకు ఎలా చేరిందనే వివరాలను ఆమె వెల్లడించలేదు.
భగవంతుడు అన్నీ చూస్తున్నాడని, తనను దెబ్బతీసేందుకే కొందరు ఈ వీడియోను వైరల్ చేశారని, బిహారీలు ఇంతలా దిగజారతారని తాను ఊహించలేదని ఆమె తన ఫేస్బుక్ పేజ్లో రాసుకొచ్చారు. మరోవైపు ఆమె పబ్లిసిటీ కోసం ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోను వైరల్ చేశారని సోషల్ మీడియాలో నటిని కొందరు ట్రోల్ చేశారు. బెంగాల్కు చెందిన 27 ఏండ్ల మధు హమ్ హై హిందుస్తాన్ అనే సీరియల్ ద్వారా భోజ్పురిలో ఎంట్రీ ఇచ్చారు. భోజ్పురి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులతో ఆమె ఎన్నో ఐటెం సాంగ్స్లో ఆడిపాడారు.