మిరుదొడ్డి, అక్టోబర్ 13 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల సెక్రటరీ నవీన్ నికోలస్ అన్నారు. మండలంలోని అల్వాల-చెప్యాల గ్రామాల శివారుల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు జరిగే సిద్దిపేట-కామారెడ్డి జిల్లాలకు చెందిన 12 గురుకుల పాఠశాల, కళాశాలలకు చెందిన 1020 మంది క్రీడాకారులకు జోనల్ మీట్ క్రీడలను జాయింట్ సెక్రటరీ అనంతలక్ష్మితో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జోనల్ మీట్ క్రీడలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల సెక్రటరీ నవీన్ నికోలస్ మాట్లాడుతూ విద్యార్థులకు అండర్-14, 17,19 విభాల్లో కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్, క్యార మ్స్, చెస్, హ్యాండ్బాల్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నాణ్యమైన గుణాత్మకమైన విద్యనందస్తున్నామన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన క్రీడాకారులకు ప్రత్యేకమైన శిక్షణ అందిస్తూ వారిని ఉన్నతులుగా తీర్చదిద్దడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీవో నిర్మల, పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, సుజాత, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.