రామాయంపేట, జనవరి 28 : పట్టణంలోని మల్లికార్జున స్వామి జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం నిర్వాహకులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ లు చేశారు. పట్టణంలో గంగబోనం, వీరగంధం ఊరేగింపు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు పట్ట ణంతో సమీప గ్రామాలకు చెందిన ప్రజలు తరలివస్తారు.
అయ్యప్ప ఆలయంలో అన్నదానం
రామాయంపేట శివారులోని అయ్యప్ప ఆలయంలో 9వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, సౌమ్య దంపతులు స్వామివారికి అభిషేకాలు చేసి, హోమం నిర్వహించారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
సామూహిక సూర్య నమస్కారాలు
పెద్దశంకరంపేట, జనవరి 28 : రథసప్తమి పురస్కరించుకుని పెద్దశంకరంపేటలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేస్తే సం పూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రధానాచార్యులు వీరప్ప, ఆచార్యులు జైహింద్రెడ్డి, శ్రీనివాస్ వివరించారు.
ఇబ్రహీంపూర్లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
చేగుంట, జనవరి 28 : మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రా మంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి విశిష్ట పూజలు నిర్వహించారు. ధర్మకర్త కిషన్రావు దేశ్ముఖ్ ఆధ్వర్యంలో స్వామివారికి అలంకరణ, అధ్యయనోత్సవం,కాలక్షేపం, పుట్ట బంగారం తేవడం నిర్వహించారు.
ఉత్సవాలకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఇబ్రహీంపూర్లో నిర్వహిస్తున్న వేంకటేశ్వరస్వామి ఉత్స వాలకు హాజరుకావాలని వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి ఆలయ ధర్మకర్త కిషన్రావు దేశ్ముఖ్ హైదరాబాద్లో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
దేవాలయ నిర్మాణానికి కృషి
మనోహరాబాద్, జనవరి 28 : మండలంలోని కూచారం గ్రామంలో నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ పనులకు జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ భూమిపూజ చేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనర్సింహ, రమేశ్గౌడ్, సత్యనారాయణగౌడ్, నాగభూషణంగౌడ్, రాజుగౌడ్, శ్రీనివాస్గౌడ్, మంగ్యా నాయక్, మహేందర్గౌడ్, సుధాకర్ పాల్గొన్నారు.
జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్
పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ
రామాయిపల్లిలో ముదిరాజ్ సంఘం నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణ పనులకు ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భాగ్యలక్ష్మీనాగేందర్రెడ్డి, సర్పంచ్లు రవీంద్రభారతి, పార్వతీమల్లేశ్, ఉప సర్పంచ్ జక్కుల వెంకటేశ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు రతన్లాల్, సత్యనారాయణ, ముదిరాజ్ సంఘం సభ్యులు కృష్ణ, కేశవులు పాల్గొన్నారు.
హాజరైన ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి