పాపన్నపేట, ఫిబ్రవరి 5: ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భారీగా భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించారు. భక్తుల కోసం ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, ఆలయ సిబ్బంది సూర్యశ్రీనివాస్, రవివీర్కుమార్, మధుసూదన్రెడ్డి, తోట నర్సింలు, వరుణాచారి, బత్తినిరాజు, మహేశ్, ఆలయ కమిటీ సభ్యులు సౌకర్యాలు కల్పించారు. వేద పండితులు శంకరశర్మ, పార్థివశర్మ, రాముశర్మ, రాజశేఖర్శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.
అమ్మవారిని దర్శించుకున్న జూనియర్ సివిల్ జడ్జి
ఏడుపాయల వనదుర్గా భవానీమాతను మెదక్ జూనియర్ సివిల్ జడ్జి రీటాలాల్ చాంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి, సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఏడుపాయల జాతరకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల్లో నిర్వహించే జాతరకు హాజరుకావాల్సిందిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్ ఆదివారం అందజేశారు. హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందజేసి, జాతరకు రావాల్సిందిగా కోరారు. వారితో పాటు ఆలయ ధర్మకర్తలు సిద్ధిరాములు, మనోహర్, సాయిలు, మణెమ్మ కిషన్, పెంటయ్య, నాగభూషణం, పాపన్నపేట మండల బీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు.
ఏడుపాయల్లో పల్లకీ సేవ
ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రాత్రి పౌర్ణమిని పురస్కరించుకుని పల్లకీ నిర్వహించారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీ సేవ నిర్వహించారు. పలు వీధుల గుండా కొనసాగిన పల్లకీ సేవ ఆలయానికి చేరుకున్నది. కార్యక్రమానికి తిలకించడానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సారశ్రీనివాస్ పాల్గొన్నారు.