కోహీర్, డిసెంబర్15: అనేక దొంగతనాలకు కారణమైన ఇద్దరిని కోహీర్ ఎస్సై సురేశ్ గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తమ విధుల నిర్వహణలో భాగంగా గురువారం పోలీస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా, తమ వాహనాన్ని చూసి కారులో పారిపోయేందుకు యత్నిస్తుండగా, వెంబడించి కారును పట్టుకున్నామన్నా రు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో మూస్లాపూర్ గ్రామానికి చెందిన చిన్న కటికే ఖదీర్పాషా, మల్కాపూర్ గౌస్, వెలచాల పహీల్వాన్ హర్షద్ ఉన్నారు.
వారిని విచారించగా చిన్నకటికే ఖదీర్పాషా, గౌస్, అర్షద్, ఇర్ఫాన్, ఇమ్రాన్, ఎరుకల గోపాల్, సల్మాన్ కలిసి చోరీలకు పాల్పడ్డారన్నారు. కారును అద్దెకు తీసుకుని పలు ప్రాంతాల్లో మేకలు, డబ్బు, తదితర సామగ్రిని దొంగిలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఖదీర్పాషాపై ఇప్పటికే 21కేసులున్నాయని, మిగతా వారిపై కూడా కేసులున్నాయని తెలిపారు. ఖదీర్తో పాటు గౌస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వారి నుంచి కారు, రూ.5.500, రెండు కట్టెలు, ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోహీర్కు చెందిన బాధితుడు ఇమ్రాన్ 2022, నవంబర్ 6న తన రెండు మేకలు దొంగలించారని అప్పట్లో ఎస్సైకి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఖదీర్, గౌస్ను రిమాండ్కు తరలించారు. ఇమ్రాన్, ఇర్ఫాన్, ఎరుకల గోపాల్, సల్మాన్ పరారీలో ఉన్నారని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.