రాయికోడ్, మే 17: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామోజిపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆదివారం ఈతకు వెళ్లి నీటమునిగి మృతిచెందారు. ఎస్సై చైత్యన కిరణ్ వివరాల ప్రకారం.. బస్వరాజు(10), మణి(12), నిరంజన్ (12) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని పల్లె వాగులోకి ఈతకు వెళ్లారు.
రాత్రయినా ఆ చిన్నారులు ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు గ్రామంలో వెతికినా వారి జాడ దొరకలేదు. ఆ తర్వాత వాగులో గాలించగా, మృతదేహాలు లభించాయి. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతులు పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.