శివ్వంపేట, నవంబర్ 29 : విద్య, ఉపాధి కోసం విద్యార్థులు, యువత ఏకం కావాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోశ్ పిలుపు నిచ్చారు. మంగళవారం నర్సాపూర్లోని స్థానిక ఎల్లంకి కళాశాలలో ‘నూతన జాతీయ విద్యా విధానం- పరిశీలన’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సెమినార్కు ప్రధానవక్తగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోశ్ హాజరై మాట్లాడారు. విద్య కార్పొరేటీకరణ, వ్యా పారీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికొదిలేసిందని, ప్రైవేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు.
పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఉపాధ్యాయ విద్య, వృత్తివిద్యలో అనేక విద్యార్థి వ్యతిరేక ప్రతిపాదనలు చేశారని, ఈ విద్యావిధానం సమాజ గమనాన్ని తిరోగమింపజేస్తుందన్నారు. కేంద్రం బడ్జెట్లో విద్యారంగానికి కనీస నిధులు కేటాయించకుండా నూతన విద్యావిధానాన్ని ఎలా అమలు చేస్తారని? ప్రశ్నిం చారు. నూతన విద్యా విధానం రిజర్వేషన్లపై, రీయింబర్స్మెంట్పై పరోక్ష దాడి చేస్తుందన్నారు. పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఫెలోషిప్లో గణనీయంగా కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల మెదళ్లలో మత ఛాందస భావాజాలాన్ని చొప్పించేందుకు విద్యా వి ధానాన్ని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.