తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహించారు. ప్రతి గ్రామంలో బోనాలు, బతుకమ్మ, సహపంక్తి భోజనాల కార్యక్రమాలు కొనసాగాయి.
మనోహరాబాద్లో జడ్పీ చైర్పర్సన్ హేమలత, తూప్రాన్ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా, యావాపూర్లో వేడుకకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రామాయంపేట మండలం కోనాపూర్లో ఇఫ్కో చైర్మన్ దేవేందర్రెడ్డి హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
-మెదక్ జిల్లా నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 8