చార్మినార్, జనవరి 9: రంగు రంగుల అందమైన పక్షులు, చెంగుచెంగున దుంకే లేడి పిల్లలు, రాజసానికి మారుపేరుగా నిలిచే మృగరాజు సింహం వంటి తదితర జంతుజాలాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణావకాశం.
వన్యప్రాణుల ప్రేమికుల కోసం జూ పార్క్ ప్రత్యేకమైన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూలో సందర్శకుల సౌకర్యార్థం ఎన్క్లోజర్లలోని వన్యప్రాణులను కొద్ది కాలం పాటు దత్తతకు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర కాలానికి జంతుప్రేమికులు జంతుజాలాన్ని దత్తత పొందవచ్చు. అదే సమయంలో జంతుజాలం ఎన్క్లోజర్ వద్ద దత్తత పొందిన వారి పేర్లను తెలియజేస్తూ జూ అధికారులు సంవత్సర కాలం పాటు వారి పేరును బోర్డుపై సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ఎన్క్లోజర్ వద్ద ప్రదర్శిస్తుంటారు.
ఏనుగు : 5 లక్షలు
పెద్దపులి, సింహం : లక్ష
ఖడ్గమృగం, హిప్పో : లక్ష
చీతా, జాగ్వార్, ఫాంతర్, ఎలుగుబంటి, చింపాంజీ, గార్ : రూ.75 వేలు
ఆస్ట్రిచ్ (పక్షి) : రూ.50 వేలు
హైనా, ఊల్ప్, వైల్డ్డాగ్, జక్కాల్, స్మాల్ క్యాట్, : రూ. 40 వేలు
పక్షులు, నీటి పక్షులు : రూ. 30వేలు
కింగ్ కోబ్రా, ఫైథాన్, అల్జీబ్రా, తాబేలు : రూ. 30 వేలు
బబూన్, లంగూర్, లయన్ టైల్డ్మకావ్ : రూ.30 వేలు
మొసళ్లు, నిషాచర జీవులు : రూ. 20 వేలు
పాములు, ఇతర సరీసృపాలు : రూ. 20 వేలు