సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 7: మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు. గురువారం మండలపరిధిలోని మిట్టపల్లిలో మహిళలతో నడుస్తున్న పప్పులు, పసుపు, కారం యూనిట్లను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ మేరకు వారు చేస్తున్న వ్యాపారం, అమ్మకాలు, కొనుగోలు, లాభ నష్టాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు చేపట్టేందుకు కావాల్సిన నైపుణ్యాలను, నాణ్యతాప్రమాణాల గురించి నిర్వాహకులతో చర్చించారు. మిట్టపల్లి మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.