చిన్నకోడూరు, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిండు నూరేళ్లు జీవించాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని శనివారం చిన్నకోడూరులోని నాయకమ్మ దేవాలయంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి ఆమె పూజలు చేసి అక్కడే మొక్క నాటారు.
అనంతరం చిన్నకోడూరు బస్టాండ్ ఆవరణలో కేక్కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పేదలకు మరిన్ని సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ రామచంద్రం, వెంకటేశం, గంగపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు వేణు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.