ఝరాసంగం,మే20 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి వారిని శుక్రవారం బాంబే బెంచ్ ఔరంగాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.జీ డిగే దపంతులు దర్శించుకున్నారు. కేతకీలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది, అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
గర్భగుడిలోని పార్వతీసమేత సంగమేశ్వరస్వామికి కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకంతో పాటు అన్నపూజ తదితర పూజలు న్యాయమూర్తి దంపతులతో చేయించారు .ఆలయ సిబ్బంది వారిని శాలువాతో సన్మానించి ఆలయ విశిష్టతను తెలియజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.