మెదక్ అర్బన్, జనవరి 3 : మాక్ డ్రిల్ అనేది ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది తమ ఏరియా డామినేషన్ వ్యాయామంలో భాగమని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. జిల్లాకేంద్రలోని మెదక్ చర్చ్లో ఆక్టోపస్ బృందాలు మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. తీవ్రవాదులు దాడులు, చర్యలు జరిగితే చేపట్టాల్సిన ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్రిపరేషన్ ఎలా నిర్వహించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు.
సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ డ్రిల్ ఆలయ పరిసరాల్లో రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. సాధారణ భక్తులు తప్ప మిగతావారిని ఎవరిని పరిసరాలకు పోలీసులు అనుమతించలేదు. సుమారు 50 మంది ఆక్టోపస్ కమాండోస్, జిల్లా పోలీస్ సిబ్బంది 50 మంది మొత్తం 100 మంది సిబ్బంది ఈ మాక్డ్రిల్లో పాల్గొన్నారు. తీవ్రవాదులు ఆలయంలోకి చొరబడితే ఎలా వారిని మట్టుబెట్టాలి.. సాధారణ పౌరులను ఎలా రక్షించాలో మాక్డ్రిల్ ద్వారా చేసి చూపించారు. ముఖ్యంగా తీవ్రవాదుల చేతుల్లో చిక్కుకున్న వారికి ప్రాణాపాయం లేకుండా ఎలా రక్షిస్తారో ప్రదర్శించారు.
ఆలయం, చర్చి తదితర ప్రదేశాల్లో ప్రత్యేకంగా ఈ డ్రిల్స్ను వేరువేరుగా చేపట్టారు. మొదట ఆక్టోపస్ బృందాలు ఆలయం చుట్టూ చెట్ల పొదల నుంచి లోనికి ప్రవేశించాయి. పైరింజన్ను, అంబులెన్స్ అందుబాటులో ఉంచి నిజంగా ఉగ్రవాదుల దాడి జరిగితే ఎలా వ్యవహరించాలో ప్రదర్శించారు. సంస్థ అత్యవసర సంసిద్ధత ప్రణాళికను సమీక్షించడం, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం, నాణ్యతను మూల్యాంకనం, వ్యక్తులు ప్రాణం, ఆస్తి గురించి తెలుసుకుంటూ వారి విధులను సమర్ధవంతంగా అందజేయడం మాక్డ్రిల్ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీ అరుణ్రాజ్కుమార్, మెదక్ డీఎస్పీ సైదులు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్, మెదక్ పట్ణ సీఐ మధు, ఆర్ఐ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.