కొండపాక (కుకునూరుపల్లి), మార్చి 13: భారత జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా బుధవారం భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శి అనంతుల ప్రశాంత్, ఆయన సతీమణి కొండపాక జడ్పీటీసీ అనంతుల అశ్విని హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.