పటాన్చెరు, ఫిబ్రవరి 21: నందీశ్వర్గౌడ్ ఇప్పటి వరకు ఏ గుడికైనా సున్నం వేయించావా? కనీసం పటాన్చెరు పట్టణంలో బొడ్రాయి ఎక్కడుందో చెప్పగల వా.. అంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు నందీశ్వర్గౌడ్ను ప్రశ్నించారు. తాను దాదాపు 150ఆలయాలను కొత్తగా నిర్మించానని, పాతవాటిని బాగు చేయించానని చెప్పా రు. నందీశ్వర్గౌడ్ ఒక్కడే హిందువైనట్టు తాము కాదనట్టు చేస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండించారు.
పటాన్చెరు జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తాను సంప్రదాయ కుటుంబం నుం చి వచ్చానని, ఇతరులను అనవసరంగా దూషించనని, వయసులో తన కన్నా పెద్దవాడైన నందీశ్వర్గౌడ్ను గౌరవిస్తానన్నారు. తన గురించి మీడియా ముందు ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తన వద్ద రూ. 2వేల కోట్ల ఆస్తి ఉందని నిరూపిస్తే ఆ ఆస్తినంతా నందీశ్వర్కు రాసిస్తానంటూ సవాల్ విసిరారు.
బురదజల్లడం ఒక్కటే రాజకీయం కాదన్నారు. బస్టాండ్ ఆవరణలో రాజీవ్గాంధీ విగ్రహం పెడుతానని పరిశ్రమల వద్ద భారీగా చందాలు వసూలు చేసిన మోసకారి నందీశ్వర్ అన్నారు. ఆఖరుకు సొంత అన్నకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా మోసం చేస్తే నీ ఇంటికి వచ్చి అద్దాలు ధ్వంసం చేసింది వాస్తవం కాదా?.. అంటూ తూర్పారబట్టారు. పటాన్చెరులో జాగరణ చేస్తున్న భక్తు ల కోసం కళాకారులతో పాటలు పాడిస్తే రాజకీయం చే యాలనుకోవడం సిగ్గు చేటన్నారు.
ఎన్నికల కోసం భూములు అమ్ముకున్నా..
తన తండ్రి 200ఎకరాలు వారసత్వంగా ఇస్తే వాటి లో వందఎకరాలు ఎన్నికల కోసం అమ్ముకున్నానని ఎమ్మెల్యే చెప్పారు. తాను భూములు కబ్జా చేసినట్టు నిరూపించిన రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నారు. సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేసే స్థాయి కాదన్న సంగతి నందీశ్వర్ గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో జడ్పీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్ల దేవానంద్, జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, సుప్రజావెంకట్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పానగేశ్, పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, తెల్లాపూర్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, మా జీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ అలీ, నాయకులు చం ద్రారెడ్డి, శ్రీధర్చారి, వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు.