తూప్రాన్: లబ్ధిదారురాలికి పింఛన్ గుర్తింపు కార్డును అందజేస్తున్న మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి తెలంగాణ మోడల్గా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం తూప్రాన్లో రూ. 25.25 కోట్లతో నిర్మించిన 382 డబుల్బెడ్రూమ్ ఇండ్లు, రూ.11 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ భవన సముదాయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. 420 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. మనోహరాబాద్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగిల్లో అర్హులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఎలాంటి పైరవీ లేకుండా పేద ప్రజలకు రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. దసరా నుంచి సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.
– తూప్రాన్/ మనోహరాబాద్/ చేగుంట/ చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 2