కోహీర్, డిసెంబర్ 27: సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో రూ. 5.60 కోట్ల తో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే డబుల్ బెడ్రూ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. దిగ్వాల్లో రూ.5.60కోట్లతో 88ఇండ్లను నిర్మించామన్నారు.
కాంగ్రెస్, టీడీపీల హయాంలో ఇల్లు కట్టాలంటే రూ. 40వేల నుంచి రూ. 60వేల వరకు ఇచ్చేవారన్నారు. అవి కూడా రూ. 5వేలకు పైగా లంచం ఇస్తేనే మంజూరు చేసేవారని విమర్శించారు. ప్రస్తుతం ఎవరి నుంచి డబ్బులు తీసుకోకుండా వందశాతం ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఉండే గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా దిగ్వాల్లో ఇండ్లను నిర్మించామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లను ఎక్కడైనా చూశారా అని లబ్ధిదారులను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.
అనంతరం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. ముందుగా బోయిని సవితకు కేటాయించిన ఇంటిని ప్రారంభించారు. వారికి మిఠాయిలను తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని కుటుంబసభ్యుల కోరిక మేరకు వారితో సెల్ఫీ దిగారు. అనంతరం సజ్జాపూర్ ఎల్లమ్మకు కేటాయించిన ఇంటిని ప్రారంభించి పట్టా పత్రాలను అందజేశారు. తర్వాత పర్వీన్ బేగానికి మంజూరు చేసిన ఇంటిని ప్రారంభించి వారికి పట్టా సర్టిఫికెట్ను అందజేశారు. అనంతరం హరితహారం మొక్కలు నాటారు. తమ కు ఇండ్ల పట్టా సర్టిఫికెట్లను అందించినందుకు మంత్రి హరీశ్రా వు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావును పూలమాల లు, శాలువలతో లబ్ధిదారులు సన్మానించారు.
మిగతా లబ్ధిదారులకు ఎంపీడీవో సుజాతనాయక్, జడ్పీటీసీ రాందాస్, తదితరులు ఇండ్ల సర్టిఫికెట్లతో పాటు మిఠాయిలను పంపిణీ చేశారు. 762 డ్వాక్రా సంఘాలకు రూ.46.25కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కు అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని మండల వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిరామలింగారెడ్డి, ఎంపీటీసీ బక్కారెడ్డి, లబ్ధిదారు లు, అధికారులు పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఉంది..
మేము కూలీ పని చేసి బతుకుతున్నాం. కూలీ చేస్తే వచ్చే పైసలతోనే మా కుటుంబం నడుస్తున్నది. మేము ఇంట్లో నలుగురం ఉంటాం. మా జీవితంలో సొంత ఇల్లు కట్టుకునే వాళ్లం కాదు. మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
– బత్తిని శోభ, దిగ్వాల్ ఇంటి లబ్ధిదారు
(సంగారెడ్డి జిల్లా)
ఈ ప్రభుత్వాన్ని మరువం..
మా ఇంట్లో ఐదుగురు ఉంటాం. మాకు ఎలాంటి ఆధారం లేదు. మేము కష్టపడి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. మాకు డబు ల్ బెడ్రూం ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి పనిచేసిన ప్రభుత్వాన్ని మా జీవితంలో మరువం.
– ఊట్ల సంతోషి, లబ్ధిదారు దిగ్వాల్
(సంగారెడ్డి జిల్లా)